యానిమల్ కీపర్ పై సింహం దాడి.. హైదరాబాద్ నెహ్రూ జూ పార్క్ లో ఘటన

-
జూపార్క్ లోని సింహాలకు ఆహారం పెడుతుండగా ఓ సింహం యానిమల్ కీపర్ పై దాడి చేసింది. హైదరాబాద్ లోని నెహ్రూ జూపార్క్ లో చోటుచేసుకుందీ ఘటన. సింహం దాడిలో హుస్సేన్ అనే యానిమల్ కీపర్ కు గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. హుస్సేన్ ను కాపాడి వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం హుస్సేన్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని వివరించారు.

Zoo Park
Hyderabad
Lion Attack
Zoo Keaper

More Telugu News